ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు షాక్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టుకున్న 3 ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇవి ప్రధానంగా అంగళ్లు అల్లర్ల కేసు, అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్‌మెంట్ మార్పుల కేసు, ఫైబర్ గ్రిడ్ ఇంటర్నెట్ కేసులపై పెట్టుకున్న 3 ముందస్తు బెయిల్ పిటిషన్ల విషయంలో చంద్రబాబుకి హైకోర్టులో నిరాశ ఎదురైంది. చంద్రబాబు ఆల్రెడీ ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో రిమాండ్ ఖైదీగా జైలులో ఉండటంతో.. డీమ్డ్ కస్టడీ గ్రౌండ్‌పై హైకోర్టు ఈ పిటిషన్లను రద్దు చేసింది. ఇక చంద్రబాబుకి బెయిల్, 5 రోజుల సీఐడీ కస్టడీకి ఇచ్చే పిటిషన్లపై లంచ్ తర్వాత విచారణ జరుపుతామని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఇక ఇన్నర్ రింగు రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబును ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు పీటీ వారెంట్లు వేశారు. వీటిపై కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత విచారణ జరిగే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.