కాకినాడ వైసీపీలో కుదుపు.. పార్టీ మారే యోచనలో ముగ్గురు ఎమ్మెల్యేలు.

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాకినాడ జిల్లా వైసీపీలో కుదుపు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. వైసీపీలో రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లో పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మకాం వేశారు.ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. టీడీపీ వైపు జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు చూస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీలో ఖాళీ లేకపోయినా షరతులు లేకుండా చేరేందుకు చంటిబాబు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వచ్చే నెల 5న చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ సైతం రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు సమాచారం. జగన్ తీసుకున్న టికెట్ల చించివేత నిర్ణయాలతో వైసీపీ క్యాడర్‌లో గుబులు చోటు చేసుకుంది. పార్టీ భవిష్యత్‌పై ఆందోళన నెలకొంది.

Leave A Reply

Your email address will not be published.