కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు వారు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక,రాహుల్ గాంధీ, ఏడు రాష్ట్రాల సీఎంలు హాజరు అయ్యారు

Leave A Reply

Your email address will not be published.