మక్కాకు వెళ్తున్న ముస్లిం సోదరులను సన్మానించిన సిద్ధూ రావణ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముస్లింల పవిత్ర నగరమైన హజ్ యాత్ర ప్రారంభమైంది . జులై 7 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది . జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చెయ్యడం ప్రతి ముస్లిం ఆచరించాల్సిన పవిత్ర విధుల్లో ఒక్కటి . ముస్లిం సోదరులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన సిద్దు రావణ్ గారిని సందర్శించడం జరిగింది . ఈ సందర్బంగా ముస్లిం సోదరులు వచ్చేది
బహుజన రాజ్యమేనని సిద్దు రావణ్ గారి మీద అల్లహ్ ఆశీర్వాదములు ఎల్లవేళలా వుంటాయని ఆశీర్వదించడం జరిగింది . ఈ శుభ సందర్బంగా సయ్యద్ అలీముద్దీన్ , సయ్యద్ అజీముద్దీన్ , సయ్యద్ నిజామోజీన్ లను మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు యాదగిరి పోచయ్య వినోద్ నాయక్ మహమ్మద్ పర్వేజ్ ఖాన్ , జుబేర్ అహ్మద్, మోబిన్ పాటిల్, అబ్దుల్లా జుబేర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.