ఏపీ పోలీసులు అదుపులో మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను ఏపీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు మఫ్టీలో మూడు కార్లలో వచ్చిన పోలీసులుప్రత్యేక బలగాలు శిరీష ఇంట్లోకి వెళ్లి ఆమెను బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుపడిన కుటుంబ సభ్యులను పక్కకునెట్టి ఆమెను పోలీసు వాహనంలో తీసుకెళ్లారు.ఇప్పటికే పలుమార్లు శిరీష ఇంటిని అనుమానాల కారణంతో ఎన్‌ఐఏఇతర సంస్థలు  సోదా చేశాయి. సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీపొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్కే అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ 2021 అక్టోబర్ 14న దక్షిణ బస్తర్‌లో మరణించారు. కిడ్నీ వైఫల్యంఇతర వ్యాధులతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ అప్పట్లో ధృవీకరించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.