ఈతకు వెళ్లి ఆరుగురు మృతి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మేడ్చల్ జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈతకు వెళ్లిన ఆరుగురు పిల్లలు మృతి చెందారు. అందులో ఐదుగురు 10,12 సంవత్సరాల పిల్లలు, ఒక ఆటో డ్రైవర్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. మృత దేహాలను బయటకి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారంతా అంబర్ పేట్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.