ఇంట్లోనే ఆరుగురు సజీవ దహనం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/మంచిర్యాల:

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మందమర్రి మండంల గుడిపల్లి వెంకటాపూర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఐదుగురు సజీవదహనం అయ్యారు. మాసు శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇంట్లో మంటలు చెలరేగాయి. ఘటనాస్థలికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో మంటలు ఎలా చెలరేగాయన్నది ఆరా తీస్తున్నారు. మృతులు: ఇంటి యజమాని శివయ్య (50), ఆయన భార్య పద్మ ‍(45), అక్క కుమార్తె మౌనిక (23),ఆమె ఇద్దరు కుమార్తెలుగా గుర్తించారు. ఐదుగురు డెడ్‌బాడీలను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.