వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి సోమేశ్ కుమార్ పోటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమేనా..? సీఎం కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా పేరున్న ఆయనకు బీహార్ బీఆర్ఎస్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించనున్నారా? సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కి అప్లై చేయడం వెనుక కారణం పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికేనా? అంటే అవుననే ఊహాగానాలు టీ పాలిటిక్స్‌లో గత కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగాలను వదిలేసి తెలంగాణ రాజకీయాల్లోకి ఇటీవల ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎక్కువగా అడుగుపెడుతున్నారు. రిటైర్మెంట్‌కు ఇంకా చాలా టైమ్ ఉండగానే రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి అరగ్రేటం చేస్తోన్నారు. ఇప్పటికే ఐపీఏస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీ తరపున కేసీఆర్ సర్కార్‌పై పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక వీఆర్ఎస్ తీసుకున్న ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కూడా తెలంగాణ రాజకీయల్లో యాక్టివ్‌గా ఉన్నారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఇటీవల ఆయన ప్రకటించగా.. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు.

ఈ క్రమంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. తెలంగాణ సీఎస్‌గా పనిచేసిన ఆయన ప్రభుత్వ, రాజకీయ వర్గాల్లో కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. ధరణి పోర్టల్ ఆలోచన సోమేష్ కుమార్‌దేనని చెబుతూ ఉంటారు. కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన అనేక విషయాల్లో పనిచేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. కేసీఆర్‌కు అత్యంత నమ్మినబంటుగా ఆయనను అందరూ చెబుతూ ఉంటారు. సీఎం కేసీఆర్ కూడా పలు వేదికలపై బహిరంగంగా సోమేష్ కుమార్‌ పనితీరును మెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనను ఏపీ క్యాడర్‌కు బదిలీ చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పరిణామాలు మారిపోయాయి. హైకోర్టు ఆదేశాలతో ఏపీలో ఆయన రిపోర్ట్ చేయగా.. నెల రోజుల పాటు ఎలాంటి పదవి అప్పగించలేదు. దీంతో ఇటీవల సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. కానీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. డిసెంబర్ వరకు సర్వీస్ ఉన్నా.. బీఆర్ఎస్‌లో చేరేందుకే వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారనే ప్రచారం బలంగా జరుగుతోందని తెలుస్తుంది.

Leave A Reply

Your email address will not be published.