త్వరలో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు జిల్లాలలో పర్యటన
ఎమ్మెల్యే మాజీ మంత్రి టి. హరీష్రావు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుజిల్లాలలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్రావు వెల్లడించారు. శనివారం తెలంగాణ భవన్లో పెద్ద పల్లి పార్లమెంటు నియోజక వర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని పేర్కొ్న్నారు. ఫిబ్రవరి లో తెలంగాణ భవన్కు వచ్చి ప్రతి రోజూ కార్యకర్తలను కలుస్తారని వెల్లడించారు.