దివ్యంగులుకు పెన్షన్ ప్రొసిడింగ్ పత్రాలు అందజేసిన స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండల కేంద్రంలో మంగళవారం దివ్యాంగులకు 4014 రూపాయల పింఛన్ ప్రొసీడింగ్స్ పత్రాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అదేవిదంగా కల్యానలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామాలయ గుడి ఫంక్షన్ హాల్ కొరకు లక్ష 30 వేల రూపాయల వంట సామాగ్రిని మాజీ ఎంపిటిసి కంది మల్లేష్ స్పీకర్ చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు ఈ కార్యక్రమంలో నసురుళ్లబాద్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పెరిక శ్రీనివాస్, ఎంపీపీ విటల్, దుర్కి సర్పంచ్ శ్యామల, కంది మల్లేష్ లక్ష్మీనారాయణ గౌడ్ నర్సింలు గౌడ్ లంబుసాయ గౌడ్ మైసా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.