టపాకాయల దుకాణాలను సందర్శించిన సభాపతి పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా ప్రాంగణంలో దీపావళి పండగ దృష్ట్యా వ్యాపారులు ఏర్పాటు చేసిన టపాకాయల దుకాణ సముదాయాలను మంగళవారం సాయంత్రం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా షాప్ నంబర్ 2 అభిషేక్ టపాకాయల దుకాణంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి 10,000వాలను టపాకాయలను ఖరీదు చేశారు .దీంతో షాపు యజమానులు రుద్రంగి గంగాధర్ గుప్తా, మురళి, యోగేష్ గుప్తాలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సహకార సంఘ చైర్మన్ ఎర్వాల కృష్ణారెడ్డి, బుడిమి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్ ,తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.