బీర్కూర్ మాజీ జడ్పిటీసీని పరామర్శించిన స్పీకర్ పోచారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అనారోగ్యంతో మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీర్కూరు మాజీ ZPTC, BRS పార్టీ నాయకులు ద్రోణవల్లి సతీష్ ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వైద్య సేవలు చేయాలనీ సూచించారు. సతీష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సభాపతి వెంట ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి ఛైర్మెన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు.