డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులకు నేడు చెక్కుల పంపిణీ చేయనున్న స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ నసురుల్లాబాద్ : శనివారం సాయంత్రం 4 గంటలకు నసుల్లాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి బాన్సువాడ అభివృద్ధి ప్రదాత గౌరవనీయ శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి విచ్చేస్తున్నారని మండల తెరాస పార్టీ అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు సొసైటీ చైర్మన్లు మండల పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గ్రామ పార్టీ అధ్యక్షులు గ్రామ రైతు బంధు అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.