25న కోటగిరి మండలంలో స్పీకర్ పోచారం పర్యటన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఈ నెల 25న శుక్రవారం తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కోటగిరి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 9-00 గం.లకు నూతనంగా పోతంగల్ మండలం ఏర్పాటుకై హహర్నిషలు కృషి చేసిన స్పీకర్ కు నూతన మండలంలోకి ఘనంగా స్వాగతం పలకడం కోసం ఘన్నారం చౌరస్తా నుంచి పోతంగల్ వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో ఘనంగా స్వాగతం పలకడం జరుగుతుంది. ఉదయం:-10-00 గం.లకు ఇటీవల నూతనంగా ఏర్పాటైన పోతంగల్ మండల అధికారిక కార్యకలా పలలో భాగమైన నూతన తహశీల్దార్ కార్యాలయాని స్పీకర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఉదయం:-11-00 గం.లకు పోతంగల్లోని బీసీ కాలనీ నుండి హాంగర్గ ఫారం వరకు ఎస్.డి.ఎఫ్.ఫండ్స్ 50 లక్షల వ్యయంతో,1.7 km లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం:-12-00 గం.లకు హెగ్డోల్లి గ్రామంలో 2BHK,రైతు వేదిక,నూతన గ్రామ పంచాయతీ భవనం,25 లక్షల వ్యయంతో నిర్మించిన సీసి రోడ్లు,16 లక్షల వ్యయంతో రైతుల సౌకర్యార్థం కోసం నిర్మించిన బీడ్జ్ లను ప్రారంభిస్తారు.తదనంతరం పబ్లిక్ మీటింగులో పాల్గొంటారు. మధ్యాహ్నం:-2-00 గం.లకు హెగ్డోల్లి గ్రామంలో భోజన విరామం. 3 గం.లకు కొల్లూరు గ్రామంలో శ్రీ గజానన్ మహారాజ్ మందిరం వద్ద 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన షేడ్ ప్రారంభోత్స వం, అలాగే 2BHK ఇండ్ల ప్రారంభోత్సవంలో స్పీకర్ పాల్గొంటారు. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్ తో పాటుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలఎంపీపీ, జెడ్పీటీసీ, జిల్లా మరియు మండల కో ఆప్షన్ సభ్యులు,మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్స్,సింగిల్ విండో చైర్మన్లు మరియు డైరెక్టర్స్,మండల వైస్ ఎంపీపి, మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు బంధు ప్రతి నిధులు, మండల మరియు గ్రామ టిఆర్ఎస్ పార్టీ ప్రతినిదులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.

Leave A Reply

Your email address will not be published.