నెమ్లి షిరిడి సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు

తెలంగాణ జ్యోతి/నసురుల్లాబాద్:
కామారెడ్డి జిల్లా, నసురుల్లాబాద్ మండల పరిధిలోని నెమ్లి గ్రామ శివారులోని సాయిబాబా ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు, ఉదయాన్నే సుప్రభాతసేవతో బాబా వారిని మేల్కొల్పిన అర్చకులు, అభిషేకాలు ప్రత్యేక అలంకరణ నిర్వహించి భక్తులక దర్శనం కల్పించారు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు హారతి నిర్వహించగా, అనంతరం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ఆలయంలో నిర్వహించిన అర్చనలు, అభిషేకాల్లో పాల్గొన్నారు, అనంతరం ఆలయంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి మండల కేంద్రంతో పాటు, వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు, రాత్రి పల్లకి సేవా, భజన కార్యక్రమాలు కొనసాగుతాయి, ఈ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని, అర్చకులు అన్నారు, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.