సూర్యగ్రహణం కారణంగా 25న శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈనెల 25న సూర్యగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తామని ఆలయ ఈవో తెలిపారు. గ్రహణం కారణంగా ఆర్జిత సేవలుశాశ్వత సేవలుపరోక్ష సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ రద్దు చేస్తున్నట్లు వివరించారు. రాత్రి గంటల తరువాత మల్లన్న సర్వదర్శనానికి భక్తులకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.