స్వర్ణరథంపై విహరించి భక్తులను అనుగ్రహించిన శ్రీవారు

వారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణరథంపై శ్రీవేంకటాద్రీశుడు విహరించి భక్తులను అనుగ్రహించారు. ఆరవ రోజైన సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనించి భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు. దాసభక్తుల నృత్యాలతోనుభజనబృందాల కోలాహలంమంగ‌ళ‌వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధుల్లో కడురమణీయంగా స్వర్ణర‌థోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది. మ‌హిళ‌లు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణర‌థ‌న్ని లాగారు.స్వర్ణరథంపై ఆసీనుడైన శ్రీవారికి శ్రీభూదేవులు ఇరుప్రక్కలా ఉన్నారు. శ్రీదేవి సువర్ణమయి. ఆమే బంగారు కాగాఆమెను భరించే స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం. బంగారం శరీరాన్ని తాకుతుంటే శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. బంగారం మహా శక్తిమంతమైన లోహం. స్వామివారికి కృష్ణావతారంలో దారుకుడు సారథిశైబ్యసుగ్రీవమేఘపుష్పవలాహకాలనేవి నాల్గు గుర్రాలు. శ్రీవారి ఇల్లు బంగారంఇల్లాలు బంగారంఇంట పాత్రలుసింహాసనం బంగారువి. అందుకని స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఇరువైపులా శ్రీదేవిభూదేవీ ఉండగా శ్రీవారు మధ్యలో ఉండిస్వర్ణరథంలో ఊరేగడం.. స్వామివారి మహోన్నతినీసార్వభౌమత్వాన్నీశ్రీసతిత్వాన్నీభూదేవీనాథత్వాన్నీ సూచిస్తున్నది. ఈ స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో బంగారుమణులుసంపదలుభోగభాగ్యాలూభూదేవి కరుణతోసమస్త ధాన్యాలూశ్రీవారికరుణతో సర్వశుభాలూసుఖాలూ చేకూరుతాయి.

Leave A Reply

Your email address will not be published.