ఈనెల 30న రాష్ట్ర బీసీ న్యాయవాదుల సదస్సు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: సామాజిక న్యాయసాధనకై బిసి న్యాయవాదుల సదస్సు ను ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాలని బిసి న్యాయవాదుల ముఖ్యనాయకుల సమావేశం లో నిర్ణయించారు.శనివారం బీసీ భవన్ లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సబ్యులు, అడ్వకేట్ ఆర్, కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్యతో పాటు హై కోర్టు అడ్వకేట్స్ ఎస్. విజయ ప్రశాంత్, నాగుల శ్రీనివాస్ యాదవ్, బత్తుల కృష్ణ, రేపాకుల నాగేశ్వరరావు, జక్కం వంశీకృష్ణ, రాఘవేంద్ర, సత్యనారాయణ, సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో కృష్ణయ్య మాట్లాడుతూ సామాజిక న్యాయసాధనకై బిసి అడ్వకేట్ చేస్తున్న పోరాటాలు అజరామమన్నారు. సామాజిక న్యాయసాధనకై పోరాటం చేస్తున్న న్యాయవాదులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సముచిత స్థానం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హైకోర్టు,సుప్రీంకోర్