25 న రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర సదస్సు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి ఆద్వర్యం లో ఈ నెల 25 న హైదరాబాద్ లోని భాగ్-లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రైతన్నలను మేల్కొ అనే నినాదం తో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి గౌరవ అద్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. సోమవారం మీడియా సమావేశం లో రైతు హక్కుల సాధన సమితి నేతలు జి.బాబు యాదవ్,గాలి సంపత్, గుర్రం నర్సింహులు,జింకల యాదగిరి లతో కలిసి మాట్లాడారు. ఈ సమావేశం లో రాష్ట్రము లో రైతులు ఎదురుకొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం బవిషత్ కార్యాచరణ ప్రణాలికను రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు. దేశానికి రైతు వెన్నుముఖ అని, రైతు లేనిదే దేశం లేదని,దేశం లో రైతులను కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందని అన్నారు. నేడు దేశం లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆదార పడి ఉన్నారని, కాని గిట్టుబాటు దర లేక దేశానికి అన్నం పెట్టె రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఫర్టలైజర్స్ ధరలు పెరగటం, అతి వృష్టి అనా వృష్టి , అకాల వర్షాలు, అదిక వడ్డిలకు రుణాలు వంటి అనేక కారణాలతో నేడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. అంతే కాకుండా పంట పండి మార్కెట్కు వెలితే దళారుల దోపిడిలు రైతులను బలితీసుకుంటున్నాయన్నారు.పరిశ్