తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో మ‌రో 14,565 ఇంజినీరింగ్ సీట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోర్ గ్రూపుల్లో సీట్లు వెన‌క్కి ఇస్తామ‌ని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూట‌ర్ కోర్సుల్లో సీట్ల‌కు అనుమ‌తి కోరాయి. దీంతో 6,930 సీట్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అలాగే కొత్త‌గా 7,635 ఇంజినీరింగ్ సీట్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఖరారు చేసింది. ఫ‌లితంగా అద‌న‌పు సీట్ల‌తో ఏటా స‌ర్కారుపై రూ. 27.39 కోట్ల భారం ప‌డ‌నుంది. ఇటీవ‌ల 86,106 ఇంజినీరింగ్ సీట్ల‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌గా, తాజాగా అనుమ‌తిచ్చిన వాటితో క‌లిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.