జూన్ 7న తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూన్ 7 న తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. 7 వ తేది ఉదుయం 11.30 గంటలకు బాగ్ లింగం పల్లి సుందరయ్య విజ్ఞన కేంద్రం జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర నలుమూలలనుండి రైతు హక్కుల సాధన సమితికి చెందినా అన్ని విబాగాలకు చెందినఅద్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే ఆయా కమిటీ లో వివిధ స్థాయిలలో నుతనగా బాధ్యతలు తీసుకున్న రైతు నాయకులు హాజరవుతున్నట్లు ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా నూతనంగా భాద్యతలు తీసుకున్న వారికి నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్య వర్గ సమావేశానికి  కార్యవర్గ సభ్యులు అందరూ తప్పని సరిగా  హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేసారు

Leave A Reply

Your email address will not be published.