పారిశ్రామిక అభివృద్ది తోనే రాష్ట పురోగతి

రాష్ట్రాంలో 109 ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు... లక్షల మందికి ఉపాధి...కోట్లల్లో పారిశ్రామిక పెట్టుబడులు...

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పారిశ్రామిక అభివృద్దితో రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్ఠి చెందుతోందనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పెద్ద పీట వేసింది.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015వ సంవత్సరంలో కొత్త పాలసీని రూపొందించి ప్రణాళికా బద్దంగా  రాష్ట్రం  ముందుకు సాగుతోంది.  కొత్త పాలసి రూపకల్పన ద్వారా తెలంగాణలో పరిశ్రమలు స్థాపించడం సులభ తరమైంది.  పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాలు మూంజూరు నుండి మౌళిక వసతుల కల్పన, అనుమతుల మంజూరి అన్ని ఆన్ లైన్ చేసింది. నూతన పారిశ్రామిక విధానం పారదర్శకంగా ఉండటంతో  ఎన్నో బహళ జాతీయ సంస్ధలు తెలంగాణలో తమ పెట్టుబడులు పెట్టాయి. ఇంకా చాలా సంస్థలు తెలంగాణ కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించేందుకు ఉత్సాహం చూపుతున్నాయి.  సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే తెలంగాణ యువకులకు ఎన్నో ప్రోత్సహకాలను అందించే విధంగా పాలసిని రూపొందించింది.  నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఎంతో మంది తెలంగాణ యువకులు పారిశ్రామిక వెత్తలు కావడమే కాకుండా లక్షల మందికి ఉపాది కల్పించారు.

కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు…..

            కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక ప్రజలకు కాలుష్య సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసింది.  రాష్ట్రంలో 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి పరిశ్రమలకు అవసరమైన నీటి పరఫరా, విధ్యత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, ఇతర మౌళిక వసతులను సమకూరుస్తూ ఇండస్ట్రియల్ పార్కులను రూపొందించింది. తెలంగాణ స్టెట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ ఆద్వర్యంలో పరిశ్రమలకు అవసరమైన అన్ని వసతులను సమకూరుస్తూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 పార్కులు ఏర్పడ్డాయి. మరో ఐదు సంవత్సరాలలో 70 పార్కుల రూపకల్పనకు ప్రణాళిక సిద్దమయింది.

ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటు తో లక్షల మంది కి ఉపాది

            తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరం నుండి 2023వ సంవత్సరం వరకు ఈ పార్కుల ఏర్పాటుకు కోట్ల రూపాయలు వెచ్చించింది.  అన్ని మౌళిక వసతులతో తీర్చిదిద్దిన 7806 ఎకరాల స్థలాన్ని 3680 సంస్ధలకు కేటాయించింది. ఇక్కడ ప్రారంభమైన పరిశ్రమల ద్వారా ద్వరా 2,63,222 మందికి ఉపాది అవకాశాలు లభించాయి. చిన్న-మధ్య తరహా పారిశ్రామిక వేత్తల కోసం రాష్ట్ర ప్రభుత్వం దండు మల్కాపూర్ గ్రామం వద్ద ఎమ్ ఎస్ ఎమ్ ఇ పథకం ద్వారా 570 ఎకరాలలో గ్రీన్ ఇండస్ర్టియల్ పార్కును రూపొందిస్తోంది. ఇక్కడ 4 వేల మంది చిన్న-మధ్య తరహా పారిశ్రామిక వేత్తలు రూ.1,200 కోట్ల రూపాయల పెట్టు బడులతో తమ వ్యాపారాలు ప్రారంభించనున్నారు. ఈ పరిశ్రమల ద్వారా మరో 15 వేల మందికి ఉపాది అవకాశాలు లభించనున్నాయి.

రైతుకు మద్దతు ధర కోసం ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లు ఏర్పాటు

తెలంగాణలో ఆహార దాన్యాలు ఉత్పత్తి అధికంగానే ఉంటుంది. ఇక్కడ పండిన పంటలు దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.  రైతులు తమ పంటను  మార్కెట్ కు  తరలించేందుకు ప్రభుత్వం మెరుగైన రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసింది.  మద్దతు ధర వచ్చే వరకు పండిన పంటను దాచుకునేందుకు గిడ్డంగుల సదుపాయం కల్పించింది. ఇలాంటి పంటలను ప్రాసెసింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసే సంస్ధలు తెలంగాణలోనే తమ ఫ్యాక్టరీలు స్థాపించడం ద్వారా తెలంగాణ రైతులకు మద్దతు ధరలు లభిస్తాయనే సదుద్దేశంతో రాష్ట్రంలోని 9 జిల్లాలలో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లను అభివృద్ది చేసింది.  

ఐటి పరిశ్రమలకు ప్రత్యేక స్థానం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటి పరిశ్రమలు తమ సత్తాచాటు తున్నాయి. ఇలాంటి తరుణంలో ఐటి పరిశ్రమలు తెలంగాణలో ఏర్పాటు అయితే ప్రపంచ దేశాలలలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందనే సంకల్పంతో టి-హబ్ ను ఏర్పాటు చేశారు.  టి-హబ్ ద్వారా ప్రపంచ ఐటి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేదుకు అవసరమైన అన్ని వసతులు, అణుమతులు అందిస్తారు.  టిస్ ఐ సి సి ఆద్వర్యంలో తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాలలో ఐటి టవర్స్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్, అధాని,  సిటి ఆర్ ఎల్ ఎస్, ఎన్ ఎక్స్ టి ఆర్ ఎ వంటి సంస్థలు రూ. 33,881 కోట్ల రూపాయల పెట్టుబడులతో తెలంగాణలో తమ డేటా సెంటర్ లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం వారికి అవసరమైన తన్ని వసతులను సమకూర్చింది.

అనుమతుల  ప్రక్రియ సులభతరం:

తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగవలసిన అవసరం లేకుండా పారిశ్రామిక వేత్తలు తమ కార్యాలయంలోనే కూర్చిని పని ముగించుకునే విధంగా టిస్ ఐ పాస్ విధానాన్ని రూపొందించింది.  ఆన్ లైన్ ద్వారా అవసరమై సర్టిఫికెట్ లను దాఖలు చేస్తే అధికారులు వాటిని వెరి ఫై చేసి ఆన్ లైన్ ద్వారానే అనుమతులు ఇచ్చేలా ప్రక్రియను సులభతరం చేసింది. ఇందుకోసం నిర్ణీత గడువును కూడా ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా 11 మే 2023 నాటికి 23065 యూనిట్ లు అనుమతులు పొంది రూ.2 లక్షల 61 వేల 732 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తద్వారా 15 లక్షల 74 వేల 798 మంది ఉపాది అవకాశాలు పొందారు.

మరో 18,587  యూనిట్లు  రూ.ఒక లక్ష 54 వేల 690 కోట్ల రూపాయల పెట్టబడులతో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు అనుమతులు పొంది త్వరలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నాయి. వీటి ద్వారా 9 లక్షల,13 వేల,386 మందికి ఉపాది లభించనుంది.

టి- ఐడియా ద్వారా నూతన పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు…..

            తెలంగాణలో నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువ పారిశ్రామిక వేత్తలకు టి-ఐడియా పథకం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలలా కొనుగోలులో వారికి రాయితీలు అందిస్తోంది.  ఇన్వెస్టమెంట్ సబ్సీడి, ల్యాండ్ కాస్ట్ రీ అంబర్స్ మెంట్, స్టాంప్ డ్యూటీలో రీఅంబర్స మెంట్ లు, కరెంట్ బిల్లులో రాయితీలు కల్పిస్తొంది. వీటితో పాటు అర్హులైన వారికి పావలా వడ్డీకే రుణాలు అందిస్తోంది. రెండు వేల కోట్లకు పైబడిన పెట్టబడులతో ప్రారంభించి వెయ్యు మందికి పైగా ఉపాది కల్పించే  స్టార్టప్ సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలను అందించనుంది.  2014 నుండి 2023 వ సంవత్సరం వరకు 25,068 మంది యువ పారిశ్రామిక వేత్తలకు రూ.3654.57 కోట్ల రూపాయల రాయితీలను అందించింది.

టి-ప్రైడ్ ద్వారా షెడ్యూల్డ్ కులాల వారికి ప్రత్యేక స్థానం….

షెడ్యూల్డ్ కులాలకు చెందిన పారిశ్రామిక వేత్తలకు, వికలాంగులకు ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో ప్రత్యేక గుర్తింపునిచ్చింది. పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి స్థలాల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. వారికి టి-ప్రైడ్ ద్వారా పెట్టుబడి సాయం అందించడం, మార్జిన్ మనీ ని అందించడంతో పాటు పెద్ద పెద్ద సంస్థల నుండి సబ్ కాంట్రాక్టులు ఇప్పించేలా చొరవ చూపుతొంది.  టి-ప్రైడ్ విధానం ద్వారా 2014 నుండి 2023 వరకు షెడ్యూల్డ్ కులాల పారిశ్రామిక వేత్తలకు చెందిన 28,184 యూనిట్లకు రూ.1381.8 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలను అందించింది.  వికలాంగులకు చెందిన 2104 యూనిట్లకు రూ.114.64 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

 

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనూ అగ్రస్థానం….

            పరిశ్రమలు తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తెలంగాణ అనుకూల మైనదని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు తేల్చిచెప్పింది.  2016 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా లభించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలంగాణకు మొదటి స్థానం లభించింది. 2017 మరియు 2018 సంవత్సరాలలో కూడా మొదటి మూడు స్థానాలో నిలిచింది. 2020 సంవత్సరం నుండి  ర్యాంకింగ్ విధానాన్ని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం గ్రేడిగ్ పద్దతిని ప్రవేశపెట్టింది.

ఖాయిలపడిన పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం…

నూతన పరిశ్రమల ఏర్పాటు తో పాటు నష్టాలలో నడుస్తున్న పరిశ్రమలను ప్రభుత్వం ఆదుకుంటోంది.  ఇందు కోసం తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లీనిక్ ను ఏర్పాటు  చేసింది. ఈ క్లినిక్ ద్వారా కుంటుబడిన 550 పరిశ్రమలకు ప్రభుత్వం ఒక్కో సంస్థకు 10 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం అందించి వాటి పునరుద్దరనకు తోడ్పడింది. రామగుండం ఫర్టిలైజర్స్ పునరుద్దరణకు రూ.154 కోట్ల రూపాయలను వెచ్చించింది. అక్కడ మౌళిక వసతుల కల్పనకు మరో 105 కోట్లను కేటాయించింది. నస్టాలలో ఉన్న సిర్పూర్ కాగజ్ మిల్ ను పునరుద్దరించి ఆ పరిశ్రమ ఉద్యోగులను ఆదుకునేందుకు రూ. 87.07 కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

          పరిశ్రమల నిర్వహణకు దేశంలోనే అత్యంత అనుకూలమైన ప్రదేశం తెలంగాణ రాష్ట్రం అనే విధంగా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. పారిశ్రామిక వేత్తల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు  మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ఫెసలిటేషన్  కౌన్సిల్ లను ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ ల ద్వారా పారిశ్రామిక వేత్తలు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు వీలవుతుంది.

Leave A Reply

Your email address will not be published.