ఢిల్లీలోని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అధ్యక్షుడుహైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంటిపైగుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారనిఈ దాడిలో ఇంటి కిటికీలు దెబ్బతిన్నాయని అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2014 వ సంవత్సరం నుంచి తన ఇంటిపై ఆగంతకులు రాళ్ల దాడి చేస్తున్నారనిఆదివారం రాత్రి జరిగిన ఈ రాళ్ల దాడి నాల్గవ ఘటన అని అసద్ ట్వీట్చేశారు.ఆదివారం రాత్రి తాను జైపూర్ నుంచి ఢిల్లీ ఇంటికి 11.30 గంటలకు తిరిగిరాగా రాళ్ల దాడి జరిగినట్లు పనివాళ్లు చెప్పారనిఈ దాడిలో పలు కిటికీలు పగిలిపోయాయని ఎంపీ అసద్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదుతో ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న అసద్ ఇంటిని ఢిల్లీ డీసీపీ సందర్శించి రాళ్ల దాడి ఆధారాలు సేకరించారు. తన ఇంటి పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి రాళ్ల దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ అసద్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.