కల్లుగీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: కల్లుగీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు పోచారం నరేష్ గౌడ్ సూచించారు. కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గౌడన్నలు గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అలాగే ఇంకా మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లుగీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలని అలాగే వర్షాలు తగ్గే వరకు ఈత తాటి చెట్లు ఎక్కవద్థని జాగ్రత్త వహించాలన్నారు. మనపై మన కుటుంబాలు ఆధార పడి ఉన్నాయి అని ఆయన తెలిపారు అలాగే అవసరం ఉంటే తప్ప బయటకు ఎవ్వరూ కూడా రావద్దు అని కోరారు.

Leave A Reply

Your email address will not be published.