రేషన్ స్టాకు నిల్వలలో తేడాలు వస్తే కఠిన చర్యలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రేషన్ బియ్యం “దందా” చేసే అక్రమార్కులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటానని, రేషన్ ను నల్ల బజారు కు తరలించే ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలనీ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ డిటి మాచన రఘునందన్ హెచ్చరించారు.బుధవారం నాడు ప్రజాపంపిణీ కి ఆఖరు కావడం తో ఆయన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లో చౌక దుకాణాల ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. జులై నెల కు గాను ప్రజాపంపిణీ బుధవారం తో ముగిస్తోoదని చెప్పారు.లబ్ధి దారులు పోర్టబిలిటి సౌకర్యం ఉపయోగించుకుని తెలంగాణా లో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు అని స్పష్టం చేశారు.రేషన్ దుకాణాల్లో నిల్వల పరిమాణం లో తేడాలు వస్తే, కేసులు ఖాయం అని హెచ్చరించారు.