విద్యార్థులూ .. భయపడొద్దు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బీర్కూర్ ఉన్నత పాఠశాలలో బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు బీర్కూర్ ప్రజాప్రతినిధులు, అధికారులు మంగళవారం అవగహన కల్పించారు. గత నెల 10 న పాము కాటు తో విద్యార్థి మృతి చెందాడు. ఈ నేపథ్యంలో విద్యార్థులు భయపడి ఇంటికి వెళ్లి పోవడంతో వసతి గృహం ఖాళీ అయింది. దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని 250 టిప్పర్ల మొరం వేసి పరిసరాలను పరిశుభ్రం చేశారు. పాములు రాకుండా చర్యలు చేపట్టారు.విద్యార్థులు వసతి గృహంలో ఉండకుండా ఇంటి నుంచి పాఠశాల కు వస్తున్నారు. ఇక నుంచి వసతి గృహంలో ఉండి చదువుకోవాలని ఎలాంటి భయం లేదని అధికారులు విద్యార్థులకు సూచించారు.