విద్యార్థులు పట్టుదలతో లక్ష్య సాధనకు శ్రమించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థులు లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో శ్రమించాలని తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ విశ్రాంత డిప్యూటీ కార్యదర్శి కె. వెంకటనర్సయ్య ఉద్భోదించారు. చౌటుప్పల్లోని కేజీబీవీ విద్యార్థిని వై. అక్షయ తన  ఆశయమైన ఐ ఏ ఎస్  సాదించేందుకు పీఎస్ వీజీ ఫౌండేషన్ రూ.40 వేల ఆర్ధిక సాయాన్ని ఆయన చేతులమీ దుగా అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులను దాతలు ప్రోత్స హించాలని కోరారు. ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళిగౌడ్, కేజీబీవీ ప్రత్యే కాధికారిణి కె. భవాని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.