ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:నేటి బాలలే రేపటి పౌరులని ఉన్నత చదువులు చదువుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అటవీ,పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్లు పిలుపునిచ్చారు. ఉన్నతమైన చదువులతో గొప్ప పదవులు ఆధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించిన బేటీ బచావో- బేటీ పడావో అవగాహన,సంతకాల సేకరణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొని సంతకాలు చేశారు. అనంతరం బ్రోషర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. బాలికలందరూ తమ చదువు మీద శ్రద్దపెట్టి చడవడం ద్వారా తల్లి దండ్రుల నమ్మకాన్ని పొందాలని చెప్పారు. ఆడపిల్లలకు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.