విజయవంతంగా ముగిసిన బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ సమావేశాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిజెపి రాష్ట్ర ప్రశిక్షణ సమావేశాలు విజయవంతంగా ముగిసినట్లు  బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ సమావేశాలు ప్రశిక్షణ సమావేశాలు విజయవంతం అయినట్లు కమిటీ ఛైర్మన్ కమిటీ ఛైర్మన్ ఓ.ఎస్.రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర అద్యక్షుడు  బండి సంజయ్ కుమార్ ఓ.ఎస్.రెడ్డిని అభినందించారు. హైదరాబాద్ నగర శివారులోని లియోనియా రిసార్ట్స్ లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  జ్యోతి ప్రజ్వలన చేసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను బండి సంజయ్  ప్రారంబించారు. సమావేశాలను ఉద్దేశించి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మార్గనిర్దేశనం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు హాజరైన ఎంపీ సోయం బాపూరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, జి.వివేక్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి  తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.