మునుగోడు బై ఎలక్షన్ శివసేన పార్టి నుండి సుదర్శన్ నామినేషన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు బై ఎలక్షన్ కు శివసేన పార్టి నుండి ఆ పార్టీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధన కార్య దర్శి ఏ.సుదర్శన్ నామినేషన్ దాకలు చేసారు.ఈ మేరకు బై ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ జగన్నాథ్ రావు కు నామినేషన పత్రాలు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు బై ఎలక్షన్ డబ్బుతో ముడివడి ఉందని , ఇప్పటికే డబ్బు, మద్యం ఏరులై పారుతుందని పేర్కొన్నారు దీని పై ఎన్నికల సంఘం ప్రత్యెక ద్రుష్టి పెట్టి వీటిని నియంత్రించాలని డిమాండ్ చేసారు. డబ్బు మద్యం ప్రలోబాలకు ప్రజలు లొంగవద్దని నేటి నిజాయితి గల అబ్యర్తికి ఒతువేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.,గౌట్ గణేష్ యువ సేన రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ మల్లేష్ హరి కృష్ణ కొండస్వామి గణేశాకుమార్ వెంకటేషం నరేష్ అనిత లలిత నాగరాణి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.