ఉద్ధవ్ థాకరే కు సుప్రీంకోర్టు షాక్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉద్ధవ్ థాకరే కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఏక్‌నాథ్‌ శిండే  వర్గానిదే అసలు శివసేన పార్టీ అని, ‘విల్లుబాణం‘ గుర్తు కూడా శిండే వర్గానిదేనని ఎన్నికల సంఘం నిర్ణయించడాన్ని ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈసీ నిర్ణయంపై స్టే విధించాలని కోరారు. అయితే ఈసీ నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీం నిరాకరించింది. దీంతో ఉద్ధవ్ థాకరే వర్గం బిత్తరపోయింది. మరోవైపు ఈసీ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు శిండే వర్గానికిఈసీకి నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా జవాబివ్వాలని ఆదేశించింది. మరో వారం రోజుల్లోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఉద్ధవ్ వర్గం ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే పార్టీ పేరునుకాగడా గుర్తును కూడా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.కేంద్ర ఎన్నికల కమిషన్ ఇటీవలే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గానిదే అసలైన శివసేన అని ప్రకటించింది. అంతేకాదు.. 1966లో శివసేన ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్న ఆ పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణం’ కూడా శిందే వర్గానిదేనని స్పష్టం చేసింది. ఈ మేరకే ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ శుక్రవారం 78 పేజీల ఆదేశాలు విడుదల చేసింది. గత ఏడాది జూన్‌లో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ(ఎంవీఏ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా శిండే తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఆ తర్వాత.. ఉద్ధవ్‌శిండే వర్గాల మధ్య శివసేన పేరుపార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వాడుకోవడంపార్టీ గుర్తు విషయంలో ఆదిపత్య పోరు మొదలైంది. ఆర్నెల్ల క్రితం తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలనిపార్టీ గుర్తు విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరుతూ ఉద్ధవ్‌ ఠాక్రే ఈసీఐకి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఈసీఐ త్రిసభ్య కమిషన్‌ ఏర్పాటైంది. ఉద్ధవ్‌శిందే వర్గాల వాదోపవాదాలుఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని తుది ఆదేశాలను జారీ చేసింది. శిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆర్నెల్ల క్రితం కమిషన్‌ ఏర్పాటవ్వగానే.. శివసేన పార్టీ పేరుగుర్తును ఈసీఐ ఫ్రీజ్‌ చేసింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి శివసేన(ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ పేరునువెలుగుతున్న కాగడాను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. శిందే వర్గానికి బాలాసాహెబ్‌ అంచి శివసేన’ పేరునురెండు కత్తులతో ఉన్న డాలు గుర్తును కేటాయించింది. శుక్రవారం నాటి ఆదేశాల నేపథ్యంలో ఉద్ధవ్‌ వర్గానికి– ఈ నెల 27న జరగనున్న ఉప ఎన్నికల వరకు ఆర్నెల్ల క్రితం కేటాయించిన పార్టీ పేరుగుర్తులు కొనసాగుతాయని త్రిసభ్య కమిషన్‌ స్పష్టం చేసింది. శిందే వర్గానికి కేటాయించిన పార్టీ పేరుగుర్తు తక్షణం రద్దవుతాయనిఇకపై శివసేన పేరునువిల్లు-బాణం గుర్తును ఉపయోగించుకోవొచ్చని పేర్కొంది. ‘‘ఉద్ధవ్‌ వర్గం ఈ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు.. 2018 నాటి పార్టీ రాజ్యాంగ సవరణను ఉటంకించింది. 1999 నాటి శివసేన పార్టీ రాజ్యాంగమే ఈసీఐ రికార్డుల్లో ఉంది. అందుకే.. ఉద్ధవ్‌ వర్గం లేవనెత్తుతున్న 2018 పార్టీ రాజ్యాంగాన్ని పరిగణనలోకి తీసుకోలేం’’ అని కమిషన్‌ తన ఆదేశాల్లో తేల్చిచెప్పింది. శివసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్యాబలంలో 76 శాతం మంది శిందే వర్గంలో ఉన్నారనిఉద్ధవ్‌ వైపు 23.5 శాతం మందే ఉన్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శిందేవర్గానిదే అసలైన శివసేన అని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. ఈసీఐ నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే స్వాగతించగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయం ప్రజాస్వామ్యం పాలిట ప్రమాదకరమని ఉద్ధవ్‌ విమర్శించారు. సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బుధవారం ఉద్ధవ్ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

మరోవైపు పార్లమెంటు హౌస్‌లోని శివసేన కార్యాలయాన్ని ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక అధికారిక ప్రకటనను షేర్ చేసింది. ఆ ప్రకారం లోక్‌సభలోని 128వ నెంబర్ గదిని ఏక్‌నాథ్ షిండే క్యాంప్‌కు కేటాయించారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయాన్ని షిండే వర్గం తమ అధీనంలోకి తీసుకున్న మరుసటి రోజే ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది. లెజిస్లేటివ్ బిల్డింగ్‌లోని పార్టీ కార్యాలయం ఇప్పటికి వరకూ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే చేతిలో ఉండేది.

Leave A Reply

Your email address will not be published.