కలకలం రేపిన ఏపీ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివకుమార్ రాజు అనుమానాస్పద మరణం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివకుమార్ రాజు అనుమానాస్పద మరణం కలకలంరేుపింది. విజయవాడలోని ఓ హోటల్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉంటున్న శివకుమార్ రాజు.. పాత కేసుల విషయంలో కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. ఈనెల 5న హోటల్లో ఆయన రూమ్ తీసుకున్నారు. శుక్రవారం ఉదయం ఎన్నిసార్లు కాల్ చేసినా, బెల్ కొట్టినా రెస్పాన్స్ రాకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానించారు.

మరో తాళంతో ఆ గది డోర్ తీసి చూడగా.. శివకుమార్ రాజు నుదిటిపై గాయంతో విగతజీవిగా పడి ఉన్నారు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు.. హోటల్ గదిలో క్లూస్ సేకరించారు. మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్స్, కొన్ని ట్యాబ్లెట్స్ గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

శివకుమార్ రాజు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విజయవాడ బయలుదేరారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉంటే.. మాజీ ఫోరెన్సిక్ డైరెక్టర్ శివకుమార్‌ రాజుది సాధారణ మృతిగా ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పిన శివ కుమార్ కుటుంబసభ్యులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చాక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.