తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తారకరత్న భార్య అస్వస్థతకు లోనయ్యారు. ఆహారం తీసుకోకపోవడంతో.. ఆమె నీరసించారు. అలేఖ్యను ఆస్పత్రిలో చేర్చే యోచనలో ఉన్నారు కుటుంబ సభ్యులు. భర్త కోలుకుంటాడేమో అనే ఆశతో 23 రోజులపాటు వేచి చూసింది అలేఖ్య. తన భర్త తిరిగి మాములు మనిషి అవ్వాలని వెయ్యి దేవుళ్లకు మొక్కింది. కానీ తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. దీంతో ఆమె తట్టుకోలేకపోయింది. వెక్కి వెక్కి ఏడ్చింది. ఈ వార్త నిజం కాకపోతే బాగుండని కోరుకుంది. భర్త విగతజీవిగా ఎదురుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయింది. మానిసిక ఒత్తిడికి లోనయ్యింది. పొద్దున్నంచి ఏడుస్తూనే ఉంది. ఏడ్చి.. ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆమె ఎలాంటి ఆహారం తీసుకోలేదు. దీంతో తీవ్రంగా నీరసించిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించే యోచనలో ఉన్నారు వైద్యులు.