కడియం శ్రీహరి పై తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కడియం శ్రీహరిపై మరోసారి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు రాజయ్య బీఆర్ఎస్ పార్టీ కార్యాయలంలో సమావేశ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను సమన్వయం చేయకుండానే కడియం శ్రీహరి నియోజకవర్గంలో ప్రచారం చేయడం సరికాదు. ఈనెల 6వ తేదీ తర్వాత పార్టీ శ్రేణులను సమన్వయ పరిచే మీటింగ్ పెడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆ మీటింగ్ జరగకుండానే కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ ఎమ్మెల్యే చేతుల మీదుగానే జరగాలి. అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదు’’ అని తాటికొండ రాజయ్య పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.