వైసీపీ అక్రమాలు, అవినీతిపై మండిపడ్డ టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  వైసీపీ అక్రమాలుఅవినీతిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతమాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో వైసీపీ అక్రమాలుకుంభకోణాలు వారానికి రెండు బయటికి తీస్తామన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి అయిన తరువాత దేవాలయాల భూములను కూడా వదలడం లేదన్నారు. భూములు ఆక్రమించుకుంటున్న కాకాని అనుచరులు ఇసుక డంపింగ్ యార్డ్ లకు బాడుగులకిచ్చి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పదవి అడ్డం పెట్టుకొని కాకాణి అనుచరులు రెచ్చి పోతున్నారన్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలలో భారీ కుంభకోణాలకు పాల్పడుతున్నారనిప్రజలదేవాలయాల ఆస్తులను ఐఏఎస్ అధికారులు కాపాడాలన్నారు. వైసీపీ నేతల అవినీతిని ఎండగట్టెందుకు అవసరమైతే రాష్ట్ర స్థాయి టీడీపీ నేతలు కూడా నెల్లూరు జిల్లాకు వస్తారని సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.