శ్రీవారి సేవలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈయనకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రద ప్రసాదాలు అందజేశారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియాతో మాట్లాడుతూ. మూడు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థులు నిలబడ్డారో వారు నేటి నుండి ప్రచారం కొనసాగించే నేపథ్యంలో స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం జరిగిందన్నారు.  టిడిపి పోటీ చేస్తున్న గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో టిడిపికి అనుకూలంగా ఉందని, కచ్చితంగా విజయం సాధిస్తాం అనే నమ్మకం ఉందన్నారు. ప్రభుత్వం జరుగుతున్న అరాచకాలతో ప్రజలు విసిగు చెందారన్నారు. ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక, ఉపాధి లేక చాలా నిరుత్సాహంగా ఉన్నారని చెప్పిన ఆయన, యువత టిడిపి బ్రహ్మరధం పడుతుందని ఆయన చెప్పారు. సమాజంపై వైసీపి దాడి చేస్తుందని, జనసేన, బిజేపి, టిడిపి నాయకులు అని తేడా లేకుండా అందరిపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దౌర్జన్యాలను కలిసి ఎదుర్కోవాలని అన్ని పార్టిలు నిర్ణయంకు రావడం జరిగిందని, అయితే గతంలో విజయవాడలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పవన్ ను కలిసారు కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గౌరవంగా చంద్రబాబును కలిసారని, రాబోయే ఉద్యమాలు అన్ని‌ కూడా కలిసి పాల్గోనాలి అనే ఇద్దరు చర్చించడం జరిగిందన్నారు.

Leave A Reply

Your email address will not be published.