విద్యార్థినులతో ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన .. ఉపాధ్యాయుడి సస్పెన్షన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జగ్గయ్యపేట, విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించినందుకు పది నెలల కిందటే సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయుడు తన వికృత చేష్టలను మానుకోలేదు. తరగతులకు పంపకుండా. స్కూల్ కమిటీ సభ్యులు ప్రైవేటుగా ఉపాధ్యాయినిని నియమించుకొని పాఠాలు చెప్పిస్తున్నారు. అయినప్పటికీ ఆయన పద్ధతి మార్చుకోలేదు. గతవారం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించగా.. గ్రామ సర్పంచి సూరిబాబు వెళ్లి ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. పిల్లల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి గొడవ చేయడంతో అతన్ని పాఠశాల నుంచి పంపిన ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు ఉన్నతాధికారులకు కూడా సమాచారం చేరవేశారు. ఇటీవల అతనిపై డీవైఈఓ గౌరీశంకర్ విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దాని ఆధారంగా రాముని తిరిగి సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.