గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన తెలంగాణ స‌ర్కార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైవ్య‌వ‌హారంపై తెలంగాణ స‌ర్కార్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. 10 బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆమోదించ‌క‌పోవ‌డంపై రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారిసుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.ఈ పిటిష‌న్‌లో ప్ర‌తివాదిగా త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ పేరును చేర్చారు. బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిష‌న్ రేపు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. సెప్టెంబ‌ర్ నుంచి 7 బిల్లులు, గ‌త నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.