వినియోగదారుల హక్కుల పరిరక్షణ లో అగ్రస్థానంలో తెలంగాణా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ బాగ్ లింగంపెల్లి వినియోగదారుల రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్థాయి వినియోగదారుల చైతన్య సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి హాజరైనారు. ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ లో అగ్రస్థానంలో ఉన్నదని అన్నారు. ఈ క్రమంలో సి.సి.ఐ. జాతీయ సభ్యులు గా నియమితులైన హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చెర్మన్ మామిడి భీం రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర మైనారిటీ మోర్చా డా. ఐజాక్ రాజ్, డా. హరిప్రియా రెడ్డి, బి.జె.పి. రాష్ట్ర మైనారిటీ మోర్చా స్వచ్చ్ భారత్ కన్వీనర్ అమీనా బేగం, బి.జె.పి. రాష్ట్ర స్థాయి నాయకురాలు దొంతి శిల్పారెడ్డి, బి. పూర్ణ చందర్ గౌడ్, ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యురాలు కె. యస్. సుప్రభా మరియు కల్పనా దత్, రాజేశ్వరీ, నీలాగౌడ్, వెంకట్, సుజాత, తెలంగాణా రాష్ట్ర బి.సి.సంఘం ప్రదాన కార్యదర్శి గంధమల్లి శ్రీనివాస్ లకు గుర్తింపు కార్డులను ఇవ్వడం జరిగింది. నూతనంగా జాతీయ సభ్యులుగా నియమితులయిన కూడా వారు గ్రామ స్థాయిలో హక్కుల పరిరక్షణ కు పాటు పడాలని సాంబరాజు చక్రపాణి కోరారు.

Leave A Reply

Your email address will not be published.