తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. బుధవారం మెదక్ కొత్త సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె అధికారులు, ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. రాష్ట్ర తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం లో తెలంగాణ నెంబర్ వన్గా నిలిచిందని అన్నారు.దేశంలో అత్యధిక వేతనాలు పొందుతున్నది తెలంగాణ నే నని, ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ స్టేట్గా నిలిచిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు గాను 23 జిల్లాలో కొత్త సమీకృత కలెక్టరేట్ భవనాలు ప్రారంభించుకున్నామని, మెదక్తో 24వ జిల్లా అని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో అన్ని సేవలు ఒకే చోట లభిస్తాయని వెల్లడించారు.మెదక్ జిల్లాలో నాలుగు సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేశానని గుర్తు చేశారు.