ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు మంగళవారం ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బయలు దేరారు.

వెళ్లిన వారిలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.