నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నతెలంగాణ రాజకీయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం విజయశాంతి సహా కొంత మంది నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన నల్లారితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని రాములమ్మ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. టీబీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆయన సేవలను తెలంగాణలో వినియోగించుకునే యోచనలో.. స్ట్రాటజీ పాతదే. కాకపోతే దాన్ని అమల్లో పెట్టే విధానమే కొత్తది. యస్..! తెలంగాణలో ఇటు రూలింగ్ పార్టీ.. అటు అపోజిషన్ పార్టీల కాలిక్యులేషన్లు సరికొత్తగా కనిపిస్తున్నాయి. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు కమలం పెద్దలు సిగ్నల్స్ ఇస్తుంటే.. కిరణ్ కుమార్ రెడ్డి పేరుతో బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. బీజేపీకి కొత్త సారధిగా వచ్చిన కిషన్రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ పెద్ద కుర్చీలో ఉన్న రేవంత్రెడ్డినీ.. ఒకే వ్యూహంతో ఇరకాటంలో పెడుతోంది గులాబీ దండు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొనడం విజయశాంతి సహా కొంత మంది నేతలకు నచ్చలేదు. సమైక్య ఆంధ్రకు జైకొట్టిన నల్లారితో వేదిక పంచుకోవడానికి ఇష్టపడని రాములమ్మ తన అసంతృప్తిని బహిరంగంగానే ప్రకటించారు. టీబీజేపీ నేతల్లో కిరణ్ కుమార్ రెడ్డిపై ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా.. ఆయన సేవలను తెలంగాణలో వినియోగించుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికీ ఆ పార్టీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఆయన పరిచయాలను ఉపయోగించుకుని తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ను అమలు చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీ నేతలకు దగ్గరగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కిరణ్ పేరుతో బీజేపీని టార్గెట్ చేసింది బీఆర్ఎస్. తెలంగాణలో ఆంధ్రా వాళ్ళ పెత్తనం.. ఇదే బీఆర్ఎస్ పోలిటికల్ పాయింట్. కిరణ్ కుమార్ శిష్యుడిగా కిషన్రెడ్డి, చంద్రబాబు శిష్యుడిగా రేవంత్ వ్యవహరిస్తున్నారన్నారు మంత్రి హరీష్రావు. చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ ద్రోహులు అన్న మంత్రి.. తెలంగాణను శతవిధాలా అడ్డుకున్నారన్నారు.