తెలంగాణ రౌడీల సమితి’ దండు అంతా మునుగోడు మీద పడింది

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కన పెట్టి, ‘తెలంగాణ రౌడీల సమితి’ దండు అంతా మునుగోడు మీద పడిందని బిజెపి కార్యాలయ కార్యదర్శి డా॥ బి. ఉమాశంకర్ అన్నారు. ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారు, దీంతో గులాబీ దండు ప్రజలను మందులో ముంచుతూ  ఓట్లను కొంటోందన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మొత్తం మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ముంచుతున్నారు రాష్ట్రంలోని 118 నియోజక వర్గాల్లో పాలన గాలికి వదిలేసి ఒక నియోజక వర్గం మీద పడ్డారన్నారు. మంత్రి మల్లారెడ్డి స్వయంగా మందు పోస్తూ టిఆర్ఎస్ వైఖరి ఏంటో స్వయంగా తెలియజేశారని ఎద్దేవా చేశారు. ఇక కేసీఆర్ అయితే పాలనను గాలికి వదిలేసి జాతీయ రాజకీయాలంటూ డ్రామాలాడుతున్నారు. దొంగల బ్యాచ్ తో చేరి, దేశం పట్టుకుని తిరుగుతున్నాడన్నారు. తెలంగాణ ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తూ దోచుకున్న అవినీతి డబ్బుతో విమానం కొనుక్కుని దేశవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాడని, కోడి, క్వార్టర్ బాటిల్స్ పంచుతున్నారు ఇక్కడ దోచుకున్నది చాలదని ఇక దేశం మీద పడ్డాదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి, బ్రతుకే లేని తెలంగాణ చేశారు. కెసిఆర్ కుటుంబం మాత్రమే బంగారం అయింది. ప్రజలంతా బికారీలు అయిన పరిస్థితి ఉందన్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఇప్పుడు 5 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసిండు, తెలంగాణ లో కనీసం పండించిన పంటకి కూడా భరోసా లేదు.. రైతు అంటే కేసీఆర్ సర్కార్ కు విలువే లేదు పెద్ద దొరకి సీఎం పదవి కాదు ఇప్పుడు ప్రధానమంత్రి పదవి కావాలంట అని అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ కి మాత్రం ఆశ చావదు రైతులు, నిరుద్యోగులు, విఆర్ఎ లు మాత్రం చావాలా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పేరు చెప్పి లక్షల కోట్లు దండుకున్నారు. జాతీయ పార్టీ పెట్టి, విమానాలు కొనడానికి కేసీఆర్ కు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి .?. వేల కోట్ల విలువ జేసే ఆస్తులను కేసీఆర్ కూడబెట్టుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కెసిఆర్ బిడ్డ కవిత ప్రమేయంపై ట్విట్టర్ టిల్లు, కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదు,  ఇప్పటివరకు కెసిఆర్, కేటీఆర్ లు దత్తత తీసుకున్న గ్రామాలను ఎంత అభివృద్ధి చేశారని, ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కేటీఆర్ అంటున్నాడు ఇవన్నీ బోగస్ మాటలు అన్నారు. కెసిఆర్, కేటీఆర్ ల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు. తెలంగాణలో కెసిఆర్ కుటుంబం అరాచకాలను అవినీతిని నియంతృత్వ పాలనను ఎక్కడికక్కడ ఎండగడుతున్న ఏకైక పార్టీ బిజెపినే అన్నారు. మునుగోడు ఫలితం తర్వాత టిఆర్ఎస్ కు వీఆర్ఎస్ తప్పదు అన్నారు. మునుగోడు లో ఎగిరేది కాషాయ జెండానే

తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే. కేసీఆర్ ఓ పెద్ద పిట్టల దొర అన్నారు. తెలంగాణ ప్రజల, మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికీ, టీఆర్ఎస్ దొరల అహంకారానికీ మధ్య ఈ పోటీ కాబట్టి ప్రజలు తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు 100% బిజెపి ని గెలిపిస్తారు అని ధీమా వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.