బిజెపి పై ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసిన తెరాస

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో బీజేపీ బరితెగించి సుశీ ఇన్‌ఫ్రా నుంచి నేరుగా ఓటర్ల ఖాతాల్లోకి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గ్రామాలు.. వార్డులవారీగా ఏజెంట్లు.. ఎజెంట్ల ఖాతాల్లోకి లక్షల రూపాయలు డబ్బులు జమ చేశారంటూ టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కేవలం మూడు రోజుల వ్యవధిలోని 5.22 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు ఫిర్యాదులో తెరాస పేర్కొంది. ఈ అంశంపై సమగ్ర విచారణకు ఆదేశాలివ్వాలని విన్నవించారు. దీంతోపాటు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఎన్నికల సంఘానికి విన్నవించారు.

 

Leave A Reply

Your email address will not be published.