10 రోజుల ఢిల్లీ పోరాటం విజయవంతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: 10 రోజుల ఢిల్లీ పోరాటం విజయవంతం కావడం పట్ల ఇబిసి ఐక్యవేదిక గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వాణి రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. 10 రోజుల ఢిల్లీ పోరాటం విజయవంతం కావడం పట్ల బిసి భవన్ లో కేకు ను కట్ చేసి  రాజ్యసభ సభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వాణి రెడ్డి మాట్లాడుతూ దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టడానికి పార్లమెంటు లో బీసీ బిల్లు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు గత పది రోజులుగా వేలాది మందితో ఢిల్లీలో పార్లమెంట్ వద్ద ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, పార్లమెంటు ముట్టడి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లో తెలంగాణా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక , ఒరిస్సా కు చెందిన వేలాదిమంది నాయకులూ, కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొనడం  రాజ్యసభ సభ సభ్యులు ,జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య స్పూర్తికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమం లో బిసి ఫ్రౌంట్ రాష్ట్ర అద్యక్షులు జి.మల్లేష్ యాదవ్, బిసి సంఘం సీనియర్ నాయకురాలు ఎం. జయంతి గౌడ్ తదితరులకు హాజరైనారు.

Leave A Reply

Your email address will not be published.