ఘనంగా ప్రారంభమైన 11వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్స్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: 11వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ (హోటా) సికింద్రాబాద్ క్లబ్లో ఘనంగా ప్రారంభమైనాయి. ఈటోర్నమెంట్స్ ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సి.వి..ఆనంద్ ముఖ్య అతిగా విచ్చేసి ప్రారంబించారు.ప్రతిష్టాత్మకమైన టెన్నిస్ టోర్నమెంట్స్ సికింద్రాబాద్ క్లబ్లో హోటా అధ్యక్షుడు డా. నంద్యాల నరసింహారెడ్డి,సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు రఘురాం రెడ్డి సమక్షంలో ప్రారంబించారు. 11వ హోటా ప్రధాన స్పాన్సర్ అయిన ఎ.పి. “వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్” సంజయ్ రెడ్డి .మొత్తం కార్యక్రమానికి హోటా టోర్నమెంట్ చీఫ్ కో-ఆర్డినేటర్ మరియు సికింద్రాబాద్ క్లబ్ సభ్యుడు వినీత్ అధ్యక్షత వహించారు.ఈ 4 రోజుల టోర్నమెంట్ బయటి ఆటగాళ్లకు ఉచిత వసతి మరియు నాలుగు రోజుల పాటు అల్పాహారం మరియు భోజనం మరియు రెండు లక్షల ప్రైజ్ మనీతో ఉంటుందని హోటా అధ్యక్షుడు డా. నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో శరత్ చౌదరి – వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పివిరావు , ప్రెసిడెంట్ ఆసిఫ్ క్లబ్ , అశోక్ కుమార్ , టిస్టా సెక్రటరీ బాలకిషన్రావు సలహాదారు హోటా , ఎల్. శ్రీనివాస్ , వైస్ ప్రెసిడెంట్ హరి కృష్ణ రెడ్డి టోర్నమెంట్ సెక్రటరీ రమణ, హోటా లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు .