తన మరదలిని ప్రేమిస్తున్నాడని యువకుడిని చంపిన బావ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బేగంపేట పాటిగడ్డకు చెందిన ఉస్మాన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బావ అజాజ్.. తన మరో ముగ్గురు మిత్రులతో కలిసి ఉస్మాన్‌ మర్డర్‌కు స్కెచ్ వేశాడు.పాటిగడ్డలో రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న ఉస్మాన్‌ను అడ్డగించారు. అజాజ్‌తో పాటు ముగ్గురు స్నేహితులు అతనిపై కత్తులతో దాడి చేసి చంపేశారు. అతని ప్రాణం పోయిన తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. హత్య జరిగిన ప్రాంతాన్ని నార్త్ జోన్ డీసీపీ రష్మీ పరిశీలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్న బేగంపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు పాల్పడిన అజాజ్‌తో పాటు ఫిరోజ్, సాహిల్, రెహన్‌ను విచరిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.