ఏపీ ప్రత్యేక హోదా కు పంగనామాలు పెట్టిన కేంద్రం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ ప్రత్యేక హోదా కు కేంద్రం పంగనామాలు పెట్టిందనిరాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక ప్యాకేజీకి తిలోదకాలిచ్చిందని మాజీ రాజ్యసభ సభ్యుడు ఏన్ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఏపీ రాష్ట్రానికి తీరని ద్రోహంఅన్యాయం చేసిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ కు స్వస్తి పలికిపోలవరం ప్రాజెక్టు)ను బీజేపీ ప్రభుత్వం ప్రశ్నార్ధకం చేసిందనిదేశాన్ని అప్పుల భారత్ చేసిందని దుయ్యబట్టారు.దేశాన్ని ఇద్దరు గుజరాతీలు అమ్మేశారని.. ఇద్దరు గుజరాతీలు కొనేశారని తులసిరెడ్డి అన్నారు. బీజేపీ పాలనలో దేశానికి అచ్చే దిన్‌కు బదులుగా చచ్చే దిన్ దాపురించిందన్నారు. నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డి కీలు బొమ్మలుగా మారారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరు సూత్రాలు అమలు చేసి అభివృధి చేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం లో రైతులుమహిళలునిరుద్యోగులుకాంట్రాక్టర్లుసర్పంచులు రగిలి పోతున్నారని.. జగన్ మా దరిద్రం.. జగన్ మా శని’ అని ప్రజలు అంటున్నారన్నారని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.