రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి అదేశించారు

- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలో ఆర్&బి రోడ్లు అద్దంలా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ ఇప్పటికే అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా PR(పీరియాడికల్ రెన్యువల్), FDR (ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు 2,500 కోట్లు మంజూరు చేశారని, కేసిఆర్ ఆదేశాల మేరకు వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎర్రమంజిల్ ఆర్.అండ్.బి ఆఫీస్ ఛాంబర్ లో రాష్ట్ర ఉన్నత అధికారులతో సమీక్షలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు.

గత రెండు సీజన్లలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు యుద్ద ప్రాతిపదికన పునరుద్ధరణ చేయాలని అధికారులకు దిశా నిర్దేశము చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా PR(పీరియాడికల్ రెన్యువల్), FDR(ఫ్లడ్ డ్యామేజ్ రోడ్స్) కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ గారు 2,500 కోట్లు మంజూరు చేశారని అన్నారు. కేసిఆర్ గారి ఆదేశాల ప్రకారం వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టుల పునరుద్ధరణ పనులు వేగంగా నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని మంత్రి పునరుద్ఘాటించారు.

ఈ రోజువరకు 70% పనులకు టెండర్లు పిలిచామని ,దశలవారిగా LOA లు ఇస్తున్నామని అధికారులు తెలుపగా …మిగతా ప్రక్రియ కూడా జనవరి 5 వ తారీఖు కల్లా పూర్తీ చేసి జనవరి 10 నుండి పనులు మొదలు పెట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.ఇది వరకే వివిధ దశల్లో ఉన్న పనులను మార్చ్ లోపు పూర్తి చేయాలనీ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.