పిఎస్ఎల్వి సి 58 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేసిన సీఎం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ‌ర్షం వ్యక్తం చేశారు. రాకెట్‌ విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అమెరికా తర్వాత బ్లాక్ హోల్స్‌ను అధ్యయనం చేయడానికి అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్నరెండో దేశంగా భారతదేశం అవతరించిందన్నారు. కొత్త సంవత్సరం రోజున మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసిలో భారతదేశ పతాకాన్ని ఎగుర వేసిందన్నారు. పీఎస్‌ఎల్‌వీ- సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave A Reply

Your email address will not be published.